హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపు ఇచ్చారు. శనివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మహాసభ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని దేశవ్యాప్తంగా చాటిచెప్పే ఉద్దేశంతో ఈ మహాసభలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రైతులు, రైతు కూలీలు, సీపీఎం కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఏఐకేయూఎస్ అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, సారంపల్లి మల్లారెడ్డి, అరిబండి ప్రసాద్రావు, మూడ్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.