మహదేపూర్, ఆగస్టు 8: ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ-2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు శనివారం ఉదయం 20 మంది ప్రయాణికులతో కాళేశ్వరం నుంచి వరంగల్కు వెళ్తున్నది. మహదేవపూర్ సమీపంలోని అయ్యప్ప ఆలయ సమీపంలోకి రాగానే బస్సు అదుపుతప్పి రహదారి నుంచి పకకు దూసుకెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
బస్సు చెట్ల పొదల్లోనే ఆగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా..? లేక డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమా..? అనేది తెలియరాలేదు. ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డుపైకి పంపే ముందు సాంకేతిక అంశాలను సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు, పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.