అంబర్పేట, ఆగస్టు 11 : అంబర్పేట నియోజకవర్గమంతటా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట తదితర డివిజన్ల పరిధిలోని బస్తీలు, కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ల నిర్మాణ పనులు, వీధి దీపాల ఏర్పాటు, పుట్పాత్ల ఆధునీకీకరణ, పారిశుధ్య నిర్వహణ, వర్షపునీటి పైప్లైన్ పనులు, నాలాల విస్తరణ వంటి పలు అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.
బాగ్అంబర్పేట డివిజన్లోని ఎస్బీఐ కాలనీ పార్కులో రూ.5.30లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న షెడ్డు నిర్మాణం పనులకు స్థానిక కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నానని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని కోట్లు ఖర్చుపెట్టి బీటీ, సీసీ, వీడీసీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.
ఇంకా పలుచోట్ల రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. అలాగే జలమండలికి సంబంధించి కూడా కోట్లు ఖర్చుపెట్టి పురాతన మంచినీటి, డ్రైనేజీ పైప్లైన్లను తొలగించి కొత పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కలుషిత, లోఫ్రెషర్ మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో కూడా ఉన్నతాధికారులతో పర్యటించి భవిష్యత్తులో ముంపు సమస్య లేకుండా ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి తదనుగుణంగా చర్యలు చేపడుతున్నామన్నారు.
కార్యక్రమంలో ఏఈ ప్రేరణ, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, స్పోర్ట్స్ శ్రీనివాస్గౌడ్, ఎస్ఎఫ్ఐ ఆదిల్, నర్సింగ్, వేణుగోపాల్, కాలనీవాసులు కేశవరావు, రాజ్గోపాల్రెడ్డి, వేణుగోపాల్, నారాయణ, సబిత, కిరణ్మయి, రఘురాం, కవిత, టీఆర్ఎస్ నాయకులు శ్రీరాములుముదిరాజ్, మిర్యాల రవీందర్, చందూ, శ్రీనివాస్, బాబు, బీజేపీ నాయకులు బి.వెంకటరెడ్డి, చుక్క జగన్, అచ్చిని రమేష్, కోడూరు సురేష్కుమార్, శ్రీహరి, ఇమ్మిడి రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Team India: ఇండియన్ టీమ్కు గుడ్బై చెప్పనున్న కోచ్ రవిశాస్త్రి!
కోల్కతా కరోనా రోగుల్లో మూడోంతులు టీకా తీసుకున్న వారే
రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ