హైదరాబాద్ : ప్రజలందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. కూకట్పల్లి పరిధిలో లాక్డౌన్ అమలు తీరును మంగళవారం ఆయన స్వయంగా పరిశీలించి మాట్లాడారు. లాక్డౌన్ సమయంలో ఎవరూ అనవసరంగా రహదారులపైకి వచ్చి ఇబ్బందులకు గురికావద్దని అన్నారు.
ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను తప్పకపాటించాలని కోరారు. అంతకుముందు కేపీహెబీకాలనీ ఎమ్మార్వో కార్యాలయం నుంచి రోడ్ నెంబర్ వన్ వరకు నడుచుకుంటూ వెళ్లి దుకాణ సముదాయాలను పరిశీలించారు. అనంతరం గోకుల్ ప్లాట్స్ వద్ద ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిని తనిఖీ చేశారు. ధ్రువపత్రాలు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానా విధించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.