కీవ్: ఉక్రెయిన్పై (Ukraine) రష్యా దాడులు కొనసాగుతునే ఉన్నాయి. ఉత్తర ఉక్రెయిన్లోని చెర్నివ్ (Chernihiv) నగరంపై మాస్కో క్షిపణులను ప్రయోగించింది. అవి ఎనిమిది అంతస్తుల భవనంపై పడటంతో 17 మంది మృతిచెందారు. 61 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది. చెర్నివ్ రాజధాని కీవ్కు ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో రష్యా – బెలారస్ సరిహద్దులకు సమీపంలో ఉంది. ఇరుదేశాల మధ్య 2022, ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. రష్యా భారీస్థాయిలో దాడులు నిర్వహిస్తుండగా, ఆయుధాల కొరతతో ఇబ్బండి పడుతున్న ఉక్రెయిన్ దళాలులు చాలా ప్రాంతాల్లో వెనక్కి మళ్లుతున్నాయి.
రష్యా దాడితో భవనాలు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఇహోర్ క్లమెంకో తెలిపారు. కార్లు, మున్సిపల్ ఇన్ఫ్రాస్టక్చర్ పూర్తి ధ్వంసమయ్యాయని వెల్లడించారు ప్రస్తుతం ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని చెప్పారు.