బేగంపేట్ : వైద్య చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పేదలు ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారు. రాంగోపాల్పేట్ డివిజన్ ఓల్డ్ గాస్మండి బస్తీకి చెందిన పి శ్రీనివాస్ గత కొంతకాలంగా వెన్నెముక సమస్యతో బాధ పడుతున్నాడు.
మెరుగైన వైద్య చికిత్స తీసుకునేందుకు ఆర్థిక అవసరం కోసం స్థానిక మాజీ కార్పొరేటర్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కు ధరఖాస్తు చేసుకున్నాడు. మంత్రి తలసాని చొరవతో రిలీజ్ అయిన రూ. 2లక్షల 50 వేల చెక్కును మంగళవారం మారేడ్పల్లిలోని తన నివాసంలో శ్రీనివాస్కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాంగోపాల్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.