కాజీపేట, ఏప్రిల్ 26 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిస్తేనే ఢిల్లీలో తెలంగాణ గళం వినిపిస్తుందని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. కాజీపేటలోని డీజిల్ కాలనీ, పోచమ్మ గుడి, కూరగాయల మార్కెట్, ఏఆర్ఆర్నగర్, విద్యానగర్, మహంకాళి గుడి, విష్ణుపురి, వైఎస్సార్ నగర్లో బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ గెలుపు కోసం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య శుక్రవారం ప్రచారం నిర్వహించారు. వీరికి మైనార్టీలు, మహిళా సంఘాలు, రైల్వే రిటైర్డ్ కార్మికులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాగా, కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి ఓటు వేసి మోసపోయామని స్థానికులు వాపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తప్పదని ఆ పార్టీ పెద్దలకు భయం పట్టుకుందన్నారు.
దామెర, ఏప్రిల్ 26 : ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ ఇస్తున్న బూటకపు హామీలను ప్రజలు నమ్మొద్దని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం దామెర మండలం కోగిల్వాయి, వెంకటాపురం, సింగరాజులపల్లి, పులుకుర్తి, ల్యాదెళ్ల, దామెర, ఓగ్లాపూర్, దమ్మన్నపేట, తక్కళ్లపహాడ్, ముస్త్యాలపల్లి, పసరగొండ, ఊరుగొండ, దుర్గంపేట, సీతారాంపురం గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మహిళల కు నెలకు రూ.2500 ఇవ్వలేదని, ఉచిత విద్యుత్ కొద్దిమందికే వర్తింపజేసి మోసం చేసిందన్నారు. ఆసరా పెన్షన్లు పెంచి ఇవ్వ డం లేదని, ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్ష నగ దు, తులం బంగారం, రైతుల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పిన కాంగ్రెస్కు ఆడబిడ్డల ఉసురు తగులుతుందని విమర్శించారు. బీజేపీ తెలంగాణకు నిధులను కేటాయించడం లో తీరని అన్యాయం చేసిందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ గడ్డపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఊరుగొండలో జరిగిన సమావేశంలో మారపెల్లి సుధీర్కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలోనే తెలంగా ణ అన్నివిధాలుగా ఆభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంటు, నీళ్ల కష్టాలు మొదలయ్యాయన్నారు. సమావేశాల్లో ఎంపీపీ కాగితాల శంకర్, జడ్పీటీసీ కల్పన-కృష్ణమూర్తి, వైస్ ఎంపీ పీ జాకీర్అలీ, మండలాధ్యక్షుడు గండు రామకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి ముదిగొండ కృష్ణమూర్తి, ఎంపీటీసీలు పోలం కృపాకర్రెడ్డి, గోవిందు సంధ్య-అశోక్, సంగనబోయిన మౌనిక-కిరణ్, మండల కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అక్తర్, పీఏసీఎస్ డైరెక్టర్ గుండా చంద్రమోహ న్, దాడి మల్లయ్య, గ్రామ అధ్యక్షులు ఎడ్ల గోపాల్, బత్తి ని రాజు, హింగె శ్రీనివాస్, కునాటి సునీల్రెడ్డి, చెల్పూరి చంద్రయ్య, కిన్నెర రమేశ్, చిలివేరు రాజు, మేకల సంప త్, జక్కుల రాణీరవీందర్ పాల్గొన్నారు.
ఇవి అవినీతిపరులకు, ఉద్యమకారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని, తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ బలపరిచిన సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ కోరారు. బాపూజీనగర్లో ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టం హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. ప్రజల చిరకాల వాంఛ కోచ్ ఫ్యాక్టరీని సాధించే వరకూ పోరాడుతామన్నారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, కార్పొరేటర్ సంకు నర్సింగరావు, నాయకులు నార్లగిరి రమేశ్, జనార్దన్ గౌడ్, శిరుమల్ల దశరథం, గబ్బెట శ్రీనివాస్, పాలడుగుల శివకుమార్, నయీం జుబేర్, దువ్వ కనుకరాజు, మర్యాల కృష్ణ, సుంచు అశోక్, అఫ్జల్, సోనీ, సయ్యద్ సర్వర్ పాల్గొన్నారు.