కోహెడ ఏప్రిల్ 26: ఆరు గ్యారెంటీల పేరుతో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ఉచిత పథకాలను ఉద్దెరతో నడిపిస్తున్నదని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన జీవీ. రామకృష్ణతో కలిసి కోహెడలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు పథకం మాత్రమే అమలు చేస్తున్నారని, అదికూడా ఉద్దెరతోనే నడుస్తున్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాలకిచ్చిన పథకాలను అమలు చేయలేక పోతుందన్నారు. ఉచిత గ్యాస్ పథకం, ఉచిత కరెంట్ అందరికీ అందడం లేదని ఆరోపించారు. రేషన్కార్డు ఇవ్వకుండా రేషన్కార్డులు ఉన్న వారికే పథకాలు అని ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పార్లమెంట్లో మాట్లాడి అభివృద్ధి పనులు ఏమైన తెచ్చాడా అని ప్రశ్నించారు. మతాన్ని అడ్డం పెట్టుకొని గతంలో గెలిచాడని, ఇప్పుడు అదే పంథా అవలంబిస్తే కలవదన్నారు. కరీంనగర్ నుంచి వరంగల్కు నాలుగు లేన్ల రహదారి తెచ్చానని, హైదరాబాద్ రైల్వేలైన్ను సర్వే చేయించానని బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. ఎంపీగా ఉంటే ఎలాంటి పనులు చేయాలో చేసి చూపిస్తానన్నారు. ప్రజలంతా మద్దతు తెలపాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పెరుగు నరేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ తడ్కల రాజిరెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ పేర్యాల దేవేందర్రావు, నాయకులు ఆవుల మహేందర్, పొన్నాల లక్ష్మణ్, ఇప్పరపల్లి కృష్ణమూర్తి, జాలిగాం శంకర్, గవ్వ వంశీధర్రెడ్డి తదితరులున్నారు.