కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్రెడ్డి సోదరుడు యాదగిరిరెడ్డి అంత్యక్రియలు గురువారం స్వగ్రామం తిమ్మాపూరు గ్రామంలో జరిగాయి. అన్న మృతి విషయం తెలిసిన వెంటనే కిషన్రెడ్డి ఢిల్లీ నుంచి ఉదయం 10గంటలకు స్వగ్రామానికి చేరుకొని.. మృతదేహం వద్ద కన్నీరు పెట్టారు. దగ్గరుండి కార్యక్రమాలను చేయించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గ్రామానికి చేరుకొని సంతాపం తెలిపారు. కిషన్రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అంత్యక్రియల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాము లు యాదవ్, రాష్ట్ర నాయకులు ఎ. దేవేందర్రెడ్డి, నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు సురుసాని సురేందర్రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, వట్నాల ఈశ్వర్గౌడ్, పొట్టి ఆనంద్, వెంకటేశ్గౌడ్, మాజీ ఎంపీపీ వట్నాల శోభ ఈశ్వర్గౌడ్, మాదారం రమేశ్గౌడ్, ఎంపీపీ మంద జ్యోతి పాండు, మాజీ సర్పంచ్ గంగాపురం హరిత రాజేందర్రెడ్డి, సర్పంచ్లు గోపాల్రెడ్డి, సాధ మల్లారెడ్డి, పరంజ్యోతి, శ్రీనివాసచారి, ఎంపీటీసీ బాల్రాజ్, టీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పున్న భిక్షపతి చంద్రశేఖర్రెడ్డి, అమరేందర్రెడ్డి, మండల బీజేపీ అధ్యక్షుడు అశోక్గౌడ్, ప్రధాన కార్యదర్శి నిమ్మ అంజిరెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.