హైదరాబాద్ : నగరంలోని మలక్పేట గంజ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఆటోను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి అటు వైపుగా వస్తున్న లారీ వెనుక చక్రాల కిందపడిపోయారు. లారీ ఇద్దరిపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న చాదర్ఘాట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.