న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. అయితే అంతకుముందు రోజుతో పోలిస్తే.. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. తాజాగా 2,59,170 కేసులు నమోదయ్యాయి. 1761 మంది కొవిడ్తో మరణించారు. అయితే ఒక్క రోజులో చనిపోయిన వారి సంఖ్య మాత్రం ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇక 1,54,761 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకూ కరోనా కేసులు సంఖ్య 1,53,21,089కు చేరింది. కోలుకున్న వారి సంఖ్య 1,31,08,582గా ఉంది. కరోనాకు బలైన వారు 1,80,530 మంది అని ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 20,31,977 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ మొత్తం 12,71,29,113 వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.
ఏప్రిల్ 19 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 26,94,14,035 శాంపిల్స్ను సేకరించి కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. అందులో సోమవారమే 15,19,486 శాంపిల్స్ సేకరించినట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి
గుత్తా జ్వాల ఇంట పెళ్లి సంబురాలు మొదలు
డీజిలైతే కిలోమీటర్కు రూ.18, ఎలక్ట్రికలైతే రూ.6
ఆరుపదుల వయస్సులోను జిమ్లో చెమటోడుస్తున్న స్టార్ హీరో