Stray Dogs | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వీధి కుక్కలు (Stray Dogs) బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం బోరబండ (Borabanda) ప్రాంతంలో కుక్కల దాడి (Stray Dogs) లో నాలుగేండ్ల చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే.. బుధవారం మరో ఘటన చోటు చేసుకుంది. చైతన్యపురి (Chaitanyapuri) ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న కొందరు పిల్లలపై దాడి చేశాయి. ఈ దాడిలో రిషి (Rishi)అనే నాలుగేండ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ ఘటనపై బాలుడి తల్లి మాట్లాడుతూ.. ‘నా కొడుకు కొంత మంది పిల్లలతో కలిసి ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నాలుగు, ఐదు కుక్కలు పిల్లల్ని వెంబడించాయి. అనంతరం నా కుమారుడు రిషిపై దాడి చేశాయి. ఈ దాడిలో బాబుకు రక్తస్రావమైన గాయాలయ్యాయి. మేం వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాం’ అని ఆమె తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వారు వచ్చి కుక్కల్ని తీసుకెళ్లారని.. అనంతరం వాటిని విడిచిపెట్టినట్లు చెప్పారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోనూ వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. హైదర్గూడ ఎర్రబోడ కాలనీలో ఐదుగురిపై దాడి చేశాయి. ముందుగా ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని కరిచిన పిచ్చి కుక్క.. బాలుడి చెయ్యిపట్టుకుని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. కిందపడేసి తలపై, చేతులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాలుడు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోని వారు వచ్చి అడ్డుకున్నారు.
మరోవైపు వరుస కుక్కల దాడి ఘటనలతో నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి నుంచి బయటకెళ్లాలంటేనే వణికిపోతున్నారు. వీధి కుక్కల బారి నుంచి తమని కాపాడాలని మున్సిపల్ అధికారులను వేడుకుంటున్నారు.
Also Read..
వీధి కుక్కల దాడిలో నాలుగేండ్ల బాలుడి మృతి
కుక్కల దాడిలో బాలుడు మరణంపై మంత్రి తలసాని విచారం .. విచారణకు మేయర్ ఆదేశం
GHMC MAYOR | చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం : మేయర్ విజయలక్ష్మి
Dogs Attack | జటాయువు పార్కులో దారుణం.. వీధి కుక్కల దాడిలో జింక పిల్ల మృతి
వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
Rashmi Gautam | కుక్కల దాడిలో బాలుడు మృతి.. స్పందించిన యాంకర్ రష్మి..!
Minister KTR: కుక్కల దాడిలో బాలుడి మృతి.. మంత్రి కేటీఆర్ సంతాపం