సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 నమస్తే తెలంగాణ): వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతి చెందడం పట్ల బాధిత కుటుంబానికి మేయర్ సంతాపం తెలిపారు. ప్రభుత్వ పరంగా, జీహెచ్ఎంసీ తరఫున బాలుడి తల్లిదండ్రులకు సహాయ సహకారాలు అందిస్తామని మేయర్ తెలిపారు. మంగళవారం అంబర్పేట ఘటనపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు. జీహెచ్ఎంసీ ద్వారా వీధి కుకల రక్షణకు అడాప్షన్(దత్తత) తీసుకునే చర్యలను ప్రారంభిస్తామన్నారు. 30 సర్కిళ్లలో వీధి శునకాలను పట్టుకునేందుకు 30 బృందాలు పనిచేస్తున్నాయని, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందనడం సరికాదన్నారు.
వీధి కుక్కలపై వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందుకు ప్రత్యేకంగా ఇద్దరు అధికారులతో పాటు ప్రతి సర్కిల్కు ఒక వాహనాన్ని ఏర్పాటు చేశామని మేయర్ చెప్పారు. యానిమల్ బర్త్ కంట్రోల్కు యాంటీ రేబిస్ ఇంజక్షన్లను ప్రతి సరిల్కు కేటాయించిన ప్రత్యేక వెహికల్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని మేయర్ పేర్కొన్నారు. మరణించిన కుకలకు ఎల్బీనగర్ ఫతుల్లాగుడ దహనవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
గ్రేటర్ వ్యాప్తంగా 5 లక్షల 75 వేల కుకలున్నాయని, ఇందులో 75% కుకలకు స్టెరిలైజేషన్ చేశారని తెలిపారు. జీహెచ్ఎంసీ ద్వారా కుకలను దత్తత తీసుకునేందుకు, సరిల్కి 20 చొప్పున 600 కుకలను ప్రతి మూడవ, లేదా 4వ ఆదివారాల్లో కేంద్రాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జీహెచ్ఎంసీతో పాటు బ్లూ క్రాస్ , పీపుల్ ఫర్ యానిమల్స్, యానిమల్ వెల్ఫేర్ సొసైటీ, నవోదయ యానిమల్స్, వెటర్నరీ పెట్ సొసైటీ రూరల్ డెవలప్మెంట్ భాగస్వామ్యంతో స్టెరిలైజేషన్ ప్రక్రియను నిరంతరాయంగా సంవత్సరానికి 160 సార్లు నిర్వహిస్తున్నాయని వివరించారు. స్టెరిలైజేషన్ ద్వారా కుకల సంఖ్య గణనీయంగా తగ్గుతుందన్నారు.
అంబర్పేట ఘటన అనంతరం 33 వీధి శునకాలను గుర్తించి మహాదేవ్పూర్ యానిమల్ కేర్ సెంటర్కు తరలించామని, వాటికి రేబిస్ వ్యాక్సినేషన్, 25 కుక్కలకు స్టెరిలైజేషన్ చేశారని మేయర్ పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకుండా ఐదు యానిమల్ కేర్ సెంటర్లను ఫతుల్లగూడ, చుడీ బజార్, పటేల్ నగర్, కేపీహెచ్బీ కాలనీ, మహాదేవపూర్లో స్టెరిలైజేషన్, యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ చేసి తిరిగి అదే ప్రదేశంలో వదిలేస్తారని చెప్పారు. జీహెచ్ఎంసీ ద్వారా 2020- 21 సంవత్సరంలో 50,091 వీధి కుకలకు, 2021- 22 లో 73,601 , 2022-23 సంవత్సరంలో 40,155 వీధి కుకలకు స్టెరిలైజేషన్ చేశారని తెలిపారు. ఈ సమావేశంలో చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వకీల్ ,సెంట్రల్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ చక్రపాణి రెడ్డి, సికింద్రాబాద్ జోన్ అసిస్టెంట్ డైరెక్టర్ సద్గుణ, అంబర్పేట డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం
– మంత్రి కేటీఆర్
రెండ్రోజుల క్రితం అంబర్పేటలో వీధి కుకల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీధి కుకల సమస్యను పరిషరించే ప్రయత్నాల్లో భాగంగా జంతు సంరక్షణ కేంద్రాలను, జంతు జనన నియంత్రణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని, వాటికి స్టెరిలైజేషన్ కోసం కూడా చర్యలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
23న ప్రత్యేక సమావేశం: మంత్రి తలసాని
అంబర్పేటలో వీధికుకల దాడిలో గాయపడి మృతి చెందిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. చాలా విషాదకరమైన ఘటన అని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వీధికుకలు, కోతుల సమస్య తీవ్రంగా ఉందని, సమస్య పరిషారానికి ఈ నెల 23న ఉదయం 11 గంటలకు మాసబ్ ట్యాంక్లోని తమ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. వీధి కుకలు, కోతుల బెడద సమస్య పరిషారానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమావేశంలో జీహెచ్ఎంసీ, వెటర్నరీ అధికారులతో ప్రత్యేక చర్చిస్తామని చెప్పారు.