Hyderabad | హయత్నగర్, ఫిబ్రవరి 8 : ఛత్తీస్గఢ్ నుండి హైదరాబాద్కు కారులో అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల గంజాయిని ఎస్టీఎఫ్డీ పోలీసులు పట్టుకున్నారు. మహిళతోపాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.8.50 లక్షలు విలువైన గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు హయత్నగర్ ఎక్సైజ్ పోలీసులు కేసు వివరాలను శనివారం వెల్లడించారు. ఛత్తీస్గఢ్, జగదల్ దేవ్పూర్కు చెందిన లేడీడాన్ సునీతాదాస్, కారు డ్రైవర్ ఇస్తియాఖురేషి, కంకన్ సనతో కలిసి కారులో సీటు వెనుక భాగంలో ప్రత్యేకంగా అలమరలు ఏర్పాటు చేసి గంజాయిని దాచారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్నట్లుగా నమ్మిస్తూ ఛత్తీస్గఢ్ నుండి హైదరాబాద్, ధూల్పేటలోని ఓ వ్యాపారికి గంజాయిని అందజేసేందుకు వెళ్తున్నారు.
పక్కా సమాచారం మేరకు హయత్నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్టీఎఫ్ సీఐ నాగరాజు, సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేయగా ఎవరికీ అనుమానం రాకుండా కారు వెనుక సీటు కింద భాగంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించారు. సునీతాదాస్తోపాటు ఇస్తియాఖురేషి, కంకన్ సనతోపాటు రూ.3.50 లక్షలు విలైవన కారు, రూ.5 లక్షలు విలువైన గంజాయిని హయత్నగర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | ఏసీ, ఫ్రిడ్జ్ రిపెరింగ్లో ఉచిత శిక్షణ
NAAC | నైపుణ్య శిక్షణతో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న న్యాక్.. కోర్సుల వివరాలివే..!
Hyderabad | ఠాగూర్ ఆస్పత్రి సీన్ రిపీట్.. డెడ్ బాడీకి ట్రీట్మెంట్ ఇచ్చారని బాధితుల ఆందోళన!