దిబ్రూఘడ్: అసోంలో ఒక వైద్యురాలిలో కరోనా డబుల్ వేరియంట్లను గుర్తించారు. ప్రస్తుతం ఆ వైద్యురాలు దిబ్రుఘడ్లో చికిత్స పొందుతున్నారు. దిబ్రుఘడ్లోని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ బీజే బోర్కాకోటి ఈ సమాచారం ఇచ్చారు. మరో విశేషం ఏంటంటే.. ఈ వైద్యురాలు కరోనా నివారణకు రెండు మోతాదులు తీసుకున్నారు.ఇంతకుముందు బ్రిటన్, బ్రెజిల్, పోర్చుగల్ దేశాల్లో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో ఇది మొదటి కేసుగా పరిశోధకులు భావిస్తున్నారు.
అసోంలోని దిబ్రూఘడ్కు చెందిన వైద్యురాలు కరోనాకు సంబంధించిన రెండు వేరియంట్లు – ఆల్ఫా, డెల్టా సోకినట్లు గుర్తించారు. డబుల్ ఇన్ఫెక్షన్ ఇతర మోనో-ఇన్ఫెక్షన్ మాదిరిగానే ఉంటుందని డాక్టర్ బోర్కాకోటి చెప్పారు. డబుల్ ఇన్ఫెక్షన్ వ్యాధిని తీవ్రంగా చేస్తుందని కాదని, ఈ కేసును నెల పాటుగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. రెండు రకాలు ఒకేసారి లేదా చాలా తక్కువ సమయంలో ఒక వ్యక్తికి సోకినప్పుడు డబుల్ ఇన్ఫెక్షన్ సంభవిస్తుందని డాక్టర్ బోర్కాకోటి వెల్లడించారు. ఇన్ఫెక్షన్ తర్వాత యాంటీబాడీస్ ఏర్పడటానికి 2-3 రోజుల సమయం పడుతుందని, అయితే కొన్నిసార్లు రెండు వైవిధ్యాలు దానిలో చురుగ్గా మారతాయని తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వైద్యురాలి భర్తకు కూడా ఆల్ఫా వేరియంట్ సోకింది. అసోంలో గత ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎక్కువగా ఆల్ఫా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత డేల్టా వేరియంట్ కేసులు రావడం ప్రారంభించాయి. అసోంలో సోమవారం నాడు 1,797 కొత్త కేసులు నమోదయ్యాయి.
పెయిన్ కిల్లర్లకు ప్రత్యామ్నాయంగా హెడ్సెట్ సృష్టి
భారత మార్కెట్లోకి యమహా ఎఫ్జెడ్25
రహస్య చట్టంలో మార్పులకు బ్రిటన్ సన్నాహాలు
ప్రతి రంగంలో సుస్థిరత సాధించే దిశగా వర్సిటీలు : వెంకయ్యనాయుడు
రికార్డు ఆదాయం అందుకున్న అమూల్
కశ్మీర్లో మరోసారి డ్రోన్ కలకలకం
చైనాను ముంచెత్తిన వరదలు : సబ్వేలో చిక్కుకుని 12 మంది మృతి
రాజ్కుంద్రా ‘క్యూ’ చెప్పింది ఇక్కడే..?
చరిత్రలో ఈ రోజు.. 138 ఏండ్ల క్రితం థియేటర్ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..