జోగులాంబ గద్వేల్: జోగులాంబ గద్వేల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఒక యువకుడు మృతి చెందిన ఘటన ఇక్కడ వెలుగు చూసింది. ధరూర్ మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు కమ్ముకున్నాయి.
మృతదేహం ధరూర్ వైన్స్ సమీపంలో పడి ఉంది. దాన్ని చూసిన స్థానికులు.. మృతుడిని మన్నాపురం గ్రామానికి చెందిన బోయ తిమ్మప్ప (25) గా గుర్తించారు. బోయ తిమ్మప్ప (25)కు భార్య, ఒక కూతురు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు