మూసాపేట(అడ్డాకుల), మే 14 : తెలంగాణ వచ్చాక రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. అడ్డాకుల విద్యుత్ సబ్స్టేషన్లో ఆరుగురు, మూసాపేట మండలంలోని జానంపేట సబ్స్టేషన్ వద్ద 8మంది రైతులకు శనివారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో విద్యుత్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారన్నారు.
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ను నిరంతరం అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులకు విద్యుత్ లోఓల్టేజీ సమస్య ఏర్పడకుండా విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించడంతోపాటు ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు కరెంటు సమస్య ఏర్పడకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, విద్యుత్ డీఈ కృష్ణమూర్తి, ఏఈ వెంకటయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తోకల శ్రీనివాస్రెడ్డి, లక్ష్మీనర్సింహయాదవ్, సర్పంచులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, ఎంపీటీసీలు రంగన్నగౌడ్, నక్క ఆంజనేయులు, అనిల్కుమార్రెడ్డి, ప్రకాశ్రెడ్డి, వెంకటేశ్, రఘురాములు, మల్లయ్య, బాలన్న, కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, సలీం తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్, మే 14 : మున్సిపాలిటీలోని అమిస్తాపూర్కు చెందిన కృష్ణయ్య ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందా డు. అతడి కుటుంబానికి విద్యుత్ శాఖ నుంచి మంజూరైన రూ.5లక్షల చెక్కును శనివారం స్థానిక సబ్స్టేషన్లో ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అందజేశారు. అదేవిధంగా కొత్తమొల్గర గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న చిల్ల సుధాకర్రెడ్డిని ఎమ్మెల్యే పరామర్శించారు. అతడికి వైద్యఖర్చుల నిమిత్తం రూ.40వేలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, వి ద్యుత్ ఏఈ ప్రదీప్, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, శేఖర్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.