హన్వాడ, ఆగస్టు 5 : పల్లెలు పరిశుభ్రంగా ఉండి, ప్రజ లు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కోట్లు వె చ్చించి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ను అందించింది. మండలంలోని 35 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు ఉన్నా యి. ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 10 గంటల వరకు వా ర్డుల్లో ట్రాక్టర్ తిరిగి ప్రజల నుంచి చెత్తను సేకరిస్తున్నది. అ నంతరం గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన డం పింగ్ యార్డుకు తరలిస్తారు. ఒక గ్రామం నుంచి రెండు నుంచి మూడు ట్రాక్టర్ల చెత్త సేకరించడం జరుగుతున్నది. గతంలో చెత్తాచెదారాన్ని ఇంటి చుట్టు పక్కల, డ్రైనేజీలో వేసే వారు.
ఇప్పుడు ట్రాక్టర్ ద్వారా సేకరించడంతో గ్రామాల్లో ఏ టు చూసినా పరిశుభ్రంగా కనబడుతున్నాయి. నెలల్లో మూ డు సార్లు గ్రామ పంచాయతీ సిబ్బంది డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నారు. దీంతో డెంగీ, అతిసారా వ్యాధి, మలేరియాతో పాటు వివిధ రోగాలు కనుమరుగయ్యాయి. దీంతో ప్రజలు ఆరోగ్యంగా జీవితం గడుపుతున్నారు. తడి, పొడి చెత్త వే ర్వేరుగా వేసేందుకు ఆయా గ్రామ పంచాయతీ ప్రతి ఇం టికీ రెండు చెత్త బుట్టలు ఇవ్వడం జరిగింది. పరిశుభ్రత, ఆరోగ్యపై అవగాహన కల్పించినందుకు ప్రజల్లో చైతన్యం వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రజల్లో చైతన్యం వచ్చింది
గతంలో ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేసేవారు. దీంతో రోగాల బారిన పడేవారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకీ ట్రాక్టర్ ఇవ్వడంతో వార్డులు తిరుగుతూ చెత్తను సేకరించడంతో గ్రామాలు పరిశుభ్రగా ఏర్పడాయి. ప్రజలు ట్రాక్టర్ వచ్చిన తర్వాతనే చెత్తను వేస్తున్నారు. ప్రజలు చైతన్యం కావడంతోనే గ్రామాలు పరిశుభ్రతతోపాటు ఆరోగ్యంగా ఉన్నారు.
ఎక్కడపడితే అక్కడ వేయడం లేదు
గత ప్రభుత్వం పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ వేసేవారు. ఇప్పు డు ట్రాక్టర్ వచ్చిన తర్వాతనే వేస్తున్నారు. ఆరు బయట ఎవరైనా చెత్త వేస్తే జరిమానా తప్పదని హెచ్చరించడంతో వేయడం లేదు. ప్రజల సహకారంతోనే గ్రామాలు పరిశుభ్రంగా ఏర్పడాయి.