ఊట్కూర్, సెప్టెంబర్ 16 : రాష్ట్రస్థాయిలో నిర్వహించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (డీఈఈసెట్) పరీక్షలో మండలకేంద్రానికి చెందిన చామకూర మహేశ్కు రాష్ట్రస్థాయి 5వ ర్యాంకు లభించిం ది. ఓంనగర్ కాలనీకి చెందిన నిరుపేద రైతు కృ ష్ణారెడ్డి, చంద్రకళ దంపతుల కుమారుడు మహే శ్ ప్రాథమిక విద్య స్థానిక సరస్వతీ శిశుమంది ర్, పదో తరగతి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, ఇంటర్ మహబూబ్నగర్ ప్రతిభ క ళాశాలలో పూర్తి చేశాడు. గురువారం రాష్ట్ర ప్ర భుత్వం విడుదల చేసిన డీఈఈ సెట్లో ర్యాంకు సాధించాడు. విద్యార్థిని ఎం పీపీ లక్ష్మి, విండో చైర్మన్ బాల్రెడ్డి, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, పీఆర్టీయూ మండలాధ్యక్షు డు లక్ష్మారెడ్డి అభినందించారు.
మక్తల్ టౌన్, సెప్టెంబర్ 16 : డీఈఈసెట్ పరీక్షలో పట్టణంలోని న్యూ శబరికాలనీకి చెంది న ఉపాధ్యాయుడు భీంరెడ్డి, హిమబిందుల కు మారుడు వి.సుదీంద్రరెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన డీఈఈ సెట్లో మొదటి ర్యాంకు సాధించాడు. సుదీంద్రరెడ్డిని తల్లిదండ్రులు అభినందించారు. అదేవిధంగా సుదీంద్రరెడ్డి తల్లిదం డ్రులు ప్రజలు ప్రశంసించారు.