హనుమకొండ, ఏప్రిల్ 25 : భారత ఎన్నికల సంఘం నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను గురువారం విడుదల చేసింది. షెడ్యూల్ను మే నెల 2వ తేదీన విడుదల చేయనున్నారు.
నామినేషన్లకు చివరి తేదీ మే 9న, నామినేషన్ల పరిశీలన మే 10న, నామినేషన్ల విత్డ్రా చేసుకునేందుకు చివరి గడువు 13న, మే 27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జూన్ 5న ఓట్లను లెక్కిస్తారు. జూన్ 8వ తేదీ వరకు లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది.