జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 8 : భారతీయులందరూ ఐక్యంగా ముందుకెళ్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ ప వర్ అన్నారు. జాతీయ సమైక్యత స్ఫూర్తితో కన్యాకుమారి నుంచి ఢిల్లీ రాజ్ఘాట్ వరకు సీఆర్పీఎఫ్ జవాన్లు చేపట్టిన సైకిల్ ర్యాలీ బుధవారం జడ్చర్లకు చేరింది. ఈ సందర్భం గా జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో ఏర్పా టు చేసిన సమావేశంలో వారు మాట్లాడా రు. జాతీయ సమైక్యతతో భారతదేశం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందన్నారు. భారత పౌరులందరూ దేశభక్తి, జాతీయభావంతో కలిగి ఉండటంచేత ప్రపంచంలోనే అన్ని రంగాల్లో భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందన్నారు.
ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా భారతదేశం అగ్రగామిగా ఉండేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొ ని భారత్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా సైకిల్ ర్యాలీ చేపట్టిన సీఆర్పీఎఫ్ జవాన్లకు అభినందనలు తెలిపారు. అనంతరం ఎస్పీ, అదనపు కలెక్టర్ జెండా ఊపి సీఆర్పీఎఫ్ జవాన్ల సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాంకుమార్, మహబూబ్నగర్ డీఎస్పీ శ్రీధ ర్, డీటీసీ డీఎస్పీ సాయిమనోహర్, సీఆర్పీఎఫ్ కమాండెంట్ విద్యాధర్, డిప్యూటీ క మాండెంట్ రమేశ్సింగ్, డీఈవో ఉషారాణి, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, ఎంఈవో మంజులాదేవి, మున్సిపల్ కమిషనర్ సునీత, ఆర్ ఐ రాఘవారావు, జడ్చర్ల పట్టణ, రూరల్ సీ ఐలు వీరాస్వామి, జములప్ప పాల్గొన్నారు.
ఘన స్వాగతం
రాజాపూర్/బాలానగర్, సెప్టెంబర్ 8 : సీఆర్పీఎఫ్ జవాన్ల సైకిల్ ర్యాలీకి రాజాపూ ర్, బాలానగర్ మండలకేంద్రాల్లో ఘనస్వాగతం లభించింది. ప్రజాప్రతినిధులు, వివి ధ పార్టీల నాయకులతోపాటు విద్యార్థులు జాతీయ పతాకంతో ర్యాలీలో పాల్గొని భారత్మాతకు జై అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ సుశీలారమేశ్నాయ క్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, టీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, వివిధ పార్టీల నాయకులు రామకృష్ణ, సీఐ జములప్ప, బాలానగర్ ఎస్సై వెంకటేశ్వర్లు, తిరుపతి, విష్ణువర్ధన్, యాదయ్య, రాజేందర్, గణేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.