రాజాపూర్/బాలానగర్, జూలై 24 : మొక్కలు పెంచితేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం మండలకేంద్రంలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా చౌరస్తాలో టీ ఆర్ఎస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేశా రు. అదేవిధంగా బాలానగర్ ఏకలవ్య గురుకుల పాఠశాల, బోడగుట్టతండా ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. గౌతాపూర్లో రైతులకు 35 పాడి పశువులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం పెంచేందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు.
కార్యక్రమాల్లో సంగీత, నాట క అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి,ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్నాయక్, మార్కెట్ కమి టీ చైర్మన్ రఘువీరారెడ్డి, వైస్ఎంపీపీ మహిపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, సర్పంచుల సంఘం మం డల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, రాఘవేందర్రెడ్డి, యాదగిరి, నరహరి, విజయ్, ఆనంద్గౌడ్, మహిపాల్రె డ్డి, దేవేందర్, కృష్ణయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర కా ర్యదర్శి వాల్యానాయక్, బాలానగర్ ఎంపీపీ కమల, జెడ్పీటీసీ కల్యాణి, వైస్ఎంపీపీ వెం కటాచారి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్రెడ్డి, యూత్ వింగ్ మం డల అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, సింగిల్విండో డైరెక్టర్లు గుడిసెల యాదయ్య, మంజునాయక్, లక్ష్మణ్నాయక్, జగన్నాయక్ పాల్గొన్నారు.