కల్వకుర్తి రూరల్, జూలై 24 : ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే కల్లు అంటే చాలా మంది ఇష్టపడుతారు. గ్రామీణ ప్రాంత ప్రజలైతే మరింతగా ఆసక్తి చూపుతారు. అయితే మండలంలోని తర్నికల్ గ్రామం అంటే నాడు గుర్తొచ్చేది తాటికల్లు.. కానీ నేడు ఖర్జూర కల్లుగా పేరొందింది. 20 సంవత్సరాల కిందట యాదయ్యగౌడ్ తన మూడున్నర ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో దాదాపుగా వెయ్యి ఖర్జూర మొక్కలను సాగు చేశాడు. వాటిని ఎప్పటికపుడు సంరక్షిస్తూ వనంగా తీర్చిదిద్దాడు. దీంతో నేడు నిత్యం ఉదయం, సాయంత్రం వంద లీటర్ల కల్లును విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఖర్జూర కల్లును తాగిన ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఈ విషయం తెలియడంతో కల్వకుర్తి మండలంతో పాటుగా ఇతర మండలాల నుంచి కల్లు ప్రియులు ఇక్కడికి వస్తున్నారు. ఖర్జూర కల్లుతోపాటు పండ్లు, పూతకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. సంవత్సరం పొడవునా కల్లు రావడం ఈ చెట్ల ప్రత్యేకత. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం హరితహారంలో భా గంగా గతేడాది మరో వెయ్యి ఈత చెట్లను అతనికి అం దించింది. దీంతో వ్యవసాయ క్షేత్రాన్ని ఖర్జూర, ఈత వనాల సంగమంగా తీర్చిదిద్దాడు. తాను ఇరవై సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న మొక్కలు నేడు వనంలా మారి తనకు ఆదాయ మార్గంగా మా రింది. ఖర్జూర వనం సాగు చేయాలని భావించిన వారికి తన వనాన్ని చూపించి సాగు విధానం, మెళకువలు, రక్షణ చర్యలపై తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి పలువురు ఫోన్ ద్వారా సంభాషించడంతో పాటుగా తన కర్జూర వనాన్ని సందర్శించి వహ్వా అంటున్నారని యాదయ్య చెప్పాడు.
మూడున్నర ఎకరాల్లో వెయ్యి చెట్లు..
ఖర్జూర చెట్లను గీస్తే 20 నుంచి 25 లీటర్ల కల్లు వస్తుందని తెలుసుకొని ఆ చెట్లను సాగు చేయాలని నిర్ణయించాడు. నీటి వసతి లేకున్నా చెట్లను సాగు చేయొవచ్చని పలువురు సూచిచండంతో సంగారెడ్డి నుంచి రూ.లక్ష వ్యయం చేసి వెయ్యి చెట్లను తీసుకొచ్చి తన పొ లంలో నాటాడు. ఈ చెట్లను సాగు చేస్తున్న సమయం లో గ్రామస్తులు యాదయ్యను విచిత్రంగా భావించారు. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా చెట్లను కాపాడుకోగా నేడు అవి ఉపాధిని ఇస్తున్నాయి. మొదట్లో చెట్లకు నీళ్లు లేక ఎండిపోగా చెట్లకు డ్రమ్ములతో నీరందించాడు. తర్వాత నీటి అవసరం పెరుగుతుండటంతో తన ప్లాట్లను విక్రయించి దాదాపు 27 బోర్లు వేసినా నీ రు పడలేదు. కేవలం రెండు, మూడింటిలో మాత్రమే కొద్దిపాటి నీరు వచ్చింది. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా ఆ బోర్ల ద్వారా వనాన్ని సాగు చేశాడు. తె లంగాణ ప్రభుత్వం ఎంజీకేఎల్ఐ ద్వారా చెరువులను నింపడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరగడం తో నీటి కష్టాలు తీరాయి.
20 ఏండ్ల శ్రమకి ఫలితం
ఇరవై ఏండ్ల కిందట నాటిన ఖర్జూర మొక్కలు నేడు ఉపాధి వనరుగా మారాయి. రెండు, మూడేండ్ల నుంచి కల్లు కారుతున్నది. దశల వారీగా 120 చె ట్లను ఎంపిక చేసుకుని వాటిని మాత్రమే గీసి కల్లు సేకరిస్తున్నాను. రోజు వంద లీటర్లు సేకరించి కల్లు ప్రియులకు విక్రయిస్తున్నాను. నీటి వసతి ఉంటే ఏడేండ్లలోనే చెట్లు పెరిగి కల్లును ఇస్తాయి. నా శ్రమకు తగిన ఫలితం దక్కుతున్నది. కల్లు సేకరణతోపాటు నాకు వచ్చిన నాటు వైద్యంతో పలు రోగాలను నయం చేస్తున్నాను.