కేపీహెచ్బీ కాలనీ (హైదరాబాద్) : తెలంగాణ అభివృద్ధి, పేదలకు సంక్షేమ ఫథకాలు అందించడం బీఆర్ఎస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Krishna Rao) అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పలు పార్కులలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రి కేటీఆర్(KTR) కృషి ఫలితంగా హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారిందని అన్నారు.
విదేశీ పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు. శుక్రవారం పదేండ్ల కాలంలో కూకట్పల్లి జరిగిన అభివృద్ధిని చూసి, పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి (BRS Candidate) రాగిడి లక్ష్మారెడ్డి Ragidi Lakshma reddy) ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పదేండ్ల కాలంగా కూకట్పల్లిలో పురాతన కాలంనాటి డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థలను ఆధునీకరించడంతో పాటు నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.
మరోవైపు ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలను అర్హులైన పేదలకు అందించినట్లు తెలిపారు. మాయమాటలతో అధికారంలోకి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమిలేదన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందాడి శ్రీనివాస్రావు, ఆవుల రవీందర్రెడ్డి, పగుడాల శిరీషాబాబురావు, జూపల్లి సత్యనారాయణ, ముద్దం నర్సింహాయాదవ్, సబిహాబేగం, మహేశ్వరీ శ్రీహరి, పండాల సతీష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.