మహబూబ్నగర్/టౌన్, జూలై 17 : హరితహారం కార్యక్రమంతో జిల్లావ్యాప్తంగా పచ్చదనం పెంచుతున్నట్లు అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ఉద్యోగ హరితయాత్రలో భాగంగా శనివారం పాలమూ రు విశ్వవిద్యాలయం సమీపంలో విత్తనబంతులు చల్లా రు. అనంతరం డ్రోన్తో విత్తనబంతులు వెదజల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే కలెక్టరేట్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున హరిత లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని సూచించారు. హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం పీయూ వైస్చాన్స్లర్ లక్ష్మీకాంత్ రాథోడ్ మాట్లాడుతూ పాలమూరు విశ్వవిద్యాలయాన్ని హరితమయంగా మా ర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది లక్ష మొక్క లు నాటగా, ఈ ఏడాది మరో లక్ష మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, బోధన, బోధనేతర సిబ్బంది సహకారంతో మొక్కలను సంరక్షిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో స్వర్ణలత, మెప్మా పీడీ శంకరాచారి, డీఆర్డీవో యాదయ్య, జెడ్పీ సీఈవో జ్యోతి, పీయూ రిజిస్ట్రార్ పవన్కుమార్, డీఈవో ఉషారాణి, కలెక్టరేట్ ఏవో ప్రేమ్రాజ్, తాసిల్దార్లు బక్క శ్రీనివాసులు, చెన్నకిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.
వృక్షసంపద పెంచాలి
గండీడ్, జూలై 17 : వృక్షసంపద పెంచేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి కోరారు. మండలంలోని కొంరెడ్డిపల్లి గ్రామ సమీపంలో విత్తనబంతులు చల్లారు. అదేవిధంగా జక్లపల్లి, పెద్దవార్వల్, చిన్నవార్వల్, సల్కర్పేట, పంచాలింగాలతండా తదితర గ్రా మాల్లోని అటవీ ప్రాంతాల్లో విత్తనబంతులను వెదజల్లా రు. కార్యక్రమాల్లో సర్పంచులు కాంతమ్మ, లలిత, అంజిలమ్మ, జితేందర్రెడ్డి, రాజునాయక్ పాల్గొన్నారు.
ఇంటింటా మొక్కలు నాటాలి
దేవరకద్ర రూరల్, జూలై 17 : ఇంటింటా మొక్కలు నాటి పెంచాలని ఎంపీపీ రమాదేవి అన్నారు. మండలకేంద్రంలోని మెగా పార్కులో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అలాగే నార్లోనికుంట గ్రామంలో సర్పంచ్ రామాంజనేయులుతో కలిసి విత్తనబంతులు చల్లారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఏవో రాజేందర్ అగర్వాల్, ఏపీవో విఘ్నేశ్వర్, ఏఈవో అశ్విని, మౌనిక, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, భాస్కర్రెడ్డి, యుగంధర్రెడ్డి పాల్గొన్నారు.
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
కోయిలకొండ, జూలై17 : అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బీ కృష్ణయ్య అన్నారు. మండలకేంద్రంలోని శ్రీరామకొండపై విత్తనబంతులు చల్లారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఖాజా నవాజ్, ఎంపీటీసీ ఆంజనేయులు, ఎంపీడీవో జయరాం, డిప్యూటీ తాసిల్దార్ శ్రీనయ్య, ఎంఈవో లక్ష్మణ్సింగ్, వెటర్నరీ డాక్టర్ రేవంత్, ఏపీఎం సునీత, హెచ్ఎం వెంకట్జీ, ఎంపీవో నసీర్అహ్మద్, నాయకులు భీంరెడ్డి, జగన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు పెంచితేనే వర్షాలు
మహ్మదాబాద్, జూలై 17 : మొక్కలు పెంచితేనే వర్షా లు సమృద్ధిగా కురుస్తాయని సర్పంచ్ మరికంటి శమంతకమణి అన్నారు. మండలంలోని వెంకట్రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో విత్తనబంతులు చల్లారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సురేఖ, ఐకేపీ సిబ్బంది ప్రభావతి, స్వరూప, పంచాయతీ కార్యదర్శి వెంకటమ్మ, నాయకులు గోవిందరెడ్డి, మరికంటి బాలవర్ధన్రెడ్డి, రాములు, చిన్న బీరయ్య, వెంకటయ్య, జైపాల్రెడ్డి, చెన్నయ్య, సత్తిరెడ్డి, శంకరయ్య పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడాలి
బాలానగర్, జూలై 17 : ప్రతిఒక్కరూ మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడాలని సర్పంచుల సంఘం మండల ప్రధాన కార్యదర్శి మెడికల్ శంకర్ అన్నారు. మండలంలోని పెద్దాయపల్లి దుందుభీ వాగు సమీపంలో మహిళా సంఘాల సభ్యులతో కలిసి విత్తనబంతులు చల్లారు. అలాగే మండలకేంద్రంలో సర్పంచ్ విజయలక్ష్మి, నామ్యాతండాలో స ర్పంచ్ పీర్యానాయక్ విత్తనబంతులు వెదజల్లారు. కార్యక్రమాల్లో అంగన్వాడీ టీచర్లు కమల, సుజాత, జరీనాబే గం పాల్గొన్నారు. అదేవిధంగా పెద్దరేవల్లి దేవునిగుట్ట సమీపంలో సర్పంచ్ నర్మద ఈత మొక్కలు నాటారు. పెద్దరేవల్లికి చెందిన స్వామిగౌడ్ పొలంలో దాదాపు 1500 ఈత మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మా జీ ఉపసర్పంచ్ స్వామిగౌడ్, గౌడ సంఘం నాయకులు ప్రహ్లాదగౌడ్, మణిగౌడ్, కృష్ణయ్యగౌడ్, ఎక్సైజ్ సీఐ బా లాజీ, ఎస్సై హరి, హెడ్కానిస్టేబుల్ శంకరయ్య ఉన్నారు.
విత్తనబంతులతో అటవీ విస్తరణ
రాజాపూర్, జూలై 17 : విత్తనబంతులతో అటవీశాతం పెరుగుతుందని సర్పంచ్ సుధారాణి అన్నారు. శనివారం మండలకేంద్రంలోని బూరుగుచెరువు, కుచ్చర్కల్, రాయపల్లి గ్రామాల్లో విత్తనబంతులు చల్లారు. అనంతరం ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నర్సింహులు, సత్తయ్య, ఆనంద్గౌడ్, పంచాయ తీ కార్యదర్శులు విజయభాస్కర్రెడ్డి, శ్రీనివాస్, ఏపీఎం వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
భాగస్వాములు కావాలి
మిడ్జిల్, జూలై 17 : హరితహారంలో ప్రతిఒక్కరూ భా గస్వాములు కావాలని సర్పంచ్ నాగమ్మ, డిప్యూటీ తాసిల్దార్ గీత కోరారు. మండలంలోని వల్లభురావుపల్లి గ్రామశివారులో విత్తనబంతులు చల్లారు. కార్యక్రమంలో ఏపీ ఎం రాందాసు, ఆర్ఐ రామాంజనేయులు, ఎంపీటీసీ నర్సింహ, సాయిలు, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, జూలై 17 : మండలకేంద్రంతోపాటు నిజాలాపూర్, నందిపేట, జానంపేట, వేము ల, సంకలమద్ది తదితర గ్రామాల్లో శనివారం మ హిళా సంఘాల సభ్యులతో కలిసి ప్రజాప్రతినిధులు విత్తనబంతులు చల్లారు. కార్యక్రమంలో నందిపేట సర్పంచ్ శేఖర్రెడ్డి, ఉపసర్పంచ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.