పీయూ వీసీ లక్ష్మీకాంత్రాథోడ్
మహబూబ్నగర్టౌన్, జూన్ 4: పాలమూరు విశ్వవిద్యాలయంలో పరిశోధనా కార్యకలాపాలను బలోపేతం చేయాలని పీయూ వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్రాథోడ్ అన్నారు. శుక్రవారం పీయూలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ఉద్యోగ ఆధారిత కోర్సులను ప్రవేశపెట్టడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మూడు పీజీ సెంటర్లు గద్వాల, కొల్లాపూర్, వనపర్తిలో మౌలిక సదుపాయల కల్పనకు వెంటనే పనులు చేపట్టాలని సూచించారు. యూజీ, పీజీ కోర్సులను ప్రవేశపెట్టడం, క్రీడా సౌకర్యాల సమగ్ర పద్ధతిలో అభివృద్ధి చేసే అవకాశాలను అన్వేషిస్తామనని పేర్కొన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ పిండి పవన్కుమార్, డైరక్టర్లు, జాయింట్ డైరక్టర్లు పాల్గొన్నారు.
నేటి నుంచి కిరాణా వ్యాపారులకు వ్యాక్సినేషన్
జడ్చర్లటౌన్, జూన్4: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కిరాణా వ్యాపారులు, కార్మికులకు శనివారం నుంచి వ్యాక్సినేషన్ వేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సునీత తెలిపారు. సూపర్స్ప్రెడర్లకు టీకా కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని కిరాణం వ్యాపారులతో పాటు కిరాణ దుకాణాల్లో పనిచేసేవారికి వ్యాక్సినేషన్ వేయనున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేకంగా స్థానిక ఎస్వీపీ నగర్కాలనీలోని బాలికల ప్రభుత్వ పాఠశాలలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ వేయించుకునే కిరాణా వ్యాపారులు ముందస్తుగా తమ పూర్తి వివరాలను మున్సిపల్ సిబ్బందికి తెలియజేయాలని కోరారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కిరాణా వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.