20బెడ్లకు సరిపడా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు
నేడు ప్రారంభించనున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, జూన్3: కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు బాదేపల్లి కమ్యూనిటీ దవాఖానలో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డు ప్రారంభానికి సిద్ధమైంది. కొవిడ్ వార్డు ప్రారంభంతో 20ఆక్సిజన్ బెడ్లు రోగులకు అందుబాటులోకి రానున్నాయి. కొవిడ్ వార్డుతోపాటు ఆక్సిజన్ ప్లాంట్ను శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. విర్కోఫార్మా కంపెనీవారు 20బెడ్లకు సరిపడా ఆక్సిజన్ ప్లాంట్తోపాటు బెడ్లను ఏర్పాటు చేయించారు. ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులోకి రాగానే కమ్యూనిటీ దవాఖానలో కొవిడ్ బాధితులకు అత్యవసర సేవలు అందేలా ఏర్పాట్లు చేశారు. కొవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేసిన కృషి ఫలితంగా ఆక్సిజన్ ప్లాంట్తోపాటు కొవిడ్ వార్డు ఉపయోగంలోకి రానున్నది. కాగా, దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్లో ఏదైనా అంతరాయం ఏర్పడితే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోకుండా ఉండేందుకుగానూ 9 ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధంగా ఉంచనున్నారు. ఆక్సిజన్ ప్లాంట్కు విద్యుత్ సౌకర్యంతోపాటు జనరేటర్ సౌకర్యం కల్పించారు.