జోగులాంబ గద్వాల : జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపులో భాగంగా మిగిలిపోయిన మూడు మద్యం దుకాణాలను లాటరీ పద్ధతి ద్వారా కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.
మంగళవారం కల్లెక్టరేట్లో జిల్లా అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మిగిలిపోయిన ధరూర్లో (17,18,) రెండు, గట్టులో ఒకటి (19) మద్యం దుకాణాలకు జిల్లా కలెక్టర్ డ్రా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన అబ్కారీ చట్టం ప్రకారం జిల్లాకు 36 దుకాణాలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. అందులో 33 దుకాణాలను 20-11-2021 నాడు లాటరీ పద్ధతి ద్వారా కేటాయించినట్లు తెలిపారు. రీ నోటిఫికేషన్ తరువాత మిగిలిపోయన 3 మద్యం దుకాణాలకు మొత్తం 81 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
ధరూర్ మండలం 17 దుకాణానికి ధరణి కుమార్ రెడ్డి , ధరూర్ మండలం 18 దుకాణానికి ఉపేంద్ర గౌడ్, గట్టు మండలం 19 దుకాణానికి సుధాకర్ రెడ్డి, లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక అయ్యారని వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సుపరిటెండెంట్ సైదులు, సీఐ గోపాల్, సిబంది, తదితరులు పాల్గొన్నారు.