న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభమైంది. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 1 వరకు కొనసాగించనున్నారు. రాజస్థాన్లోని సెంట్రల్ యూనివర్సిటీతో పాటు దేశంలోని 12 సెంట్రల్ యూనివర్శిటీలలో అడ్మిషన్లు చేపడుతున్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ద్వారా సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూ-సెట్) కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీగా సెప్టెంబర్ 1 గా నిర్ణయించారు. పరీక్ష ఫీజు డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 2 చివరి తేదీ. పరీక్షలను సెప్టెంబర్ 15, 16, 23, 24 తేదీలలో జరుపనున్నారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. కంప్యూటర్ ఆధారితంగా పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ రకం మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఉంటుంది. వివిధ లాంగ్వేజెస్ కోర్సులు మినహా మిగతా కోర్సుల పరీక్ష ఆంగ్లంలోనే ఉంటుంది.
అభ్యర్థులు ఆన్లైన్లో https://cucet.nta.nic.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు ప్రతి యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న కోర్సులు, అర్హత ప్రమాణాలను తనిఖీ చేసుకోవాలి. డెబిట్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా పేటీఎం ద్వారా పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చు. డిగ్రీ పూర్తిచేసిన వారితోపాటు డిగ్రీ చివరి పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా ఈ ప్రవేశ పరీక్షకు హాజరుకావచ్చు.
పూర్తి సమాచారం కోసం https://cucet.nta.nic.in, www.nta.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.
ఏదైనా ప్రశ్న లేదా వివరణ కోసం 011-40759000 ఫోన్ నంబర్లోగానీ, cucet@nta.ac.in లో గానీ సంప్రదించవచ్చు.
ట్విట్టర్ బర్డ్ ఫ్రై.. ఎందుకు చేశారంటే..?
మహారాజా రంజిత్ సింగ్కు తీరని అవమానం..!
వారు అధికారంలోకొచ్చారు.. మహిళా మోడల్స్పై సున్నమేశారు..!
ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్
మలేషియా ప్రధానిగా యాసిన్ రాజీనామా
లాహోర్ను పాకిస్తాన్కిచ్చిన రాడ్క్లిఫ్