హైదరాబాద్ : రాష్ట్రంలో సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నా కరోనా కోరలు చాస్తోంది. హైదరాబాద్ నగరంలోనూ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలకు ఉపక్రమించింది. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలో మొత్తం 63 మినీ కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది.
ఈ కంటైన్మెంట్ జోన్లలో ఐదు కేసుల కంటే ఎక్కువ ఉంటే మినీ కంటైన్మెంట్ జోన్ను ఏర్పాటు చేయనుంది. అలాగే ఒకే అపార్ట్మెంట్లో పాజిటివ్ కేసులు వస్తే హౌజ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తారు. ఆయా పరిధిలో వైద్యారోగ్య, మున్సిపల్ సిబ్బందిని మాత్రమే అనుతించి నివారణ చర్యలు చేపట్టనున్నారు.
అంతేకాదు, కరోనా కట్టడి కోసం జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు, శానిటైజేషన్పై దృష్టి సారించాయి. హైరిస్క్ ఉన్న ప్రాంతాల్లో రసాయనాలను స్పే చేస్తున్నారు. ఈ రోజు కూకట్పల్లి, మియాపూర్, కేపీహెచ్బీ, నిజాంపేట్ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్తో శానిటైజ్ చేశారు.
ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నది. ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా పరీక్షల కోసం వచ్చి.. కన్నుమూశాడు
సీఎం కేసీఆర్ గొప్ప దైవభక్తుడు : మంత్రి కొప్పుల
నేల తల్లి బాగుంటేనే భవిష్యత్తు : మంత్రి ఐకే రెడ్డి
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఒకే దేశంలో వ్యాక్సిన్కు రెండు ధరలా?