జగిత్యాల : కరోనా టెస్టుల కోసం వచ్చిన ఓ వ్యక్తి పరీక్ష కేంద్రం వద్దే కన్నుమూశాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ధర్మపురి పీహెచ్సీలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన రేగొండ చంద్రయ్య (70) కొవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి మధ్యాహ్నం ధర్మపురి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు.
అయితే అతడు వచ్చే సరికి పరీక్షలు చేసే సమయం దాటి పోయింది. దీంతో సిబ్బంది అతడిని కొద్ది సేపు కూర్చోవాలని సూచించడంతో పరీక్ష కేంద్రం వద్ద కూర్చున్న కొద్దిసేపటికే కుప్ప కూలాడు. కొవిడ్ నిబంధనలు మేరకు మృతదేహాన్ని వైద్య సిబ్బంది భద్రపరిచారు.
ఇవి కూడా చదవండి..
నేల తల్లి బాగుంటేనే భవిష్యత్తు : మంత్రి ఐకే రెడ్డి
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఒకే దేశంలో వ్యాక్సిన్కు రెండు ధరలా?