కాచిగూడ : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీరామ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి (40) బుధవారం విద్యానగర్-కాచిగూడ రైల్వేస్టేషన్ల మధ్య తిలక్నగర్ బ్రిడ్జి సమీపంలో పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని మృతదేహన్ని స్వాధీనపర్చుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుని ఒంటిపై తెలుపు రంగు గోల్డెన్ చుక్కలు గల పుల్ చొక్క, నలుపు రంగు ప్యాంట్ ధరించి, ఎత్తు 5.5 ఉన్నట్లు పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు 8106801989లో సంప్రదించాలని కోరారు.