బొల్లారం : ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా కృషి చేస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ ఏడో వార్డు లాల్బజార్ పోలీస్ స్టేషన్ ప్రక్క వీధి బస్తీలో స్థానికులతో కలిసి పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాయన్న మాట్లాడుతూ..గత కొంత కాలంగా తాగునీటి సమస్యతో బస్తీవాసులు ఇబ్బందిపడుతున్నారు.
నీటి బిల్లులు అధికంగా వస్తున్న నేపథ్యంలో బస్తీవాసులు బిల్లులు కూడ చెల్లించలేకపోయారు. ఈ కారణంగా కంటోన్మెంట్ బోర్డు నీటి విభాగం అధికారులు కనెక్షన్లు తొలగించారు. సానూకూలంగా స్పందించిన సాయన్న కంటోన్మెంట్ బోర్డు అధికారులతో మాట్లాడి అధిక బిల్లులు తగ్గించి, వాయిదాల పద్దతిలో బిల్లులు తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని బోర్డు అధికారులను ఆదేశించారు.
తొలగించిన కనెక్షన్లు త్వరతిగతిన పునురద్ధరించాలని కోరారు. సీసీ రోడ్డు నిర్మాణానికి తన నిధుల నుండి రూ.5లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులు భక్తవాత్సల్యం, వీరమణి, శోభ, పద్మిని, రజిని, వార్డు మహిళ అధ్యక్షురాలు నాగినేణి సరిత, ముప్పిడి మధుకర్, తదితరులు పాల్గొన్నారు.