వినాయక్నగర్, మార్చి 29: నగరవాసులకు తాగునీరు సరఫరా చేసే అలీసాగర్, ఖిల్లా వాటర్ ఫిల్టర్ బెడ్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్తా శుక్రవారం పరిశీలించారు. నీటిలో చెత్తా చెదారం పేరుకుపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటారా.. ఇదేం నిర్వహణ.. అంటూ ఖిల్లా ఫిల్టర్ బెడ్ వద్ద నెలకొన్న అధ్వానస్థితిపై ఇరిగేషన్ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సగం యంత్రాలు పనిచేయడంలేదని అధికారులు చెప్పడంతో అసహనం వ్యక్తంచేశారు. ఖిల్లా ఫిల్టర్ బెడ్ సైతం దారుణంగా ఉందని, సరైన నిర్వహణలేక ఫిల్టర్ నీటిలో నాచు, వ్యర్థ పదార్థాలు, చెత్త పేరుకుపోయిందని, ప్రజల జీవితాలతో ఇరిగేషన్ అధికారులు ఆడుకుంటున్నారని అన్నారు. నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే మున్సిపల్ కమిషనర్తో ఫోన్ద్వారా మాట్లాడారు. వారం రోజుల్లో దీనిపై నివేదిక ఇవ్వాలని, యంత్రాలు అన్ని పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించాలని ఆదేశించారు. అలీసాగర్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు రెండు నెలలకు సరిపోతాయని ఎమ్మెల్యే తెలిపారు.