కొండాపూర్ : తెలంగాణ సాధన ఉద్యమంలో శంకర్ గౌడ్ సేవలు చిరస్మరణీయమని చెవెళ్ళ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయ కులు స్వర్గీయ కొండకల్ శంకర్ గౌడ్ 7వ వర్థంతిని పురస్కరించుకొని గురువారం చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో టీఆర్ఎస్ నాయకులు తిరుమలేష్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన శంకర్గౌడ్ సేవలు మరువలేనివని, ఉద్యమ సమయంలో అలుపెరుగని పోరాటం చేసి శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్ పార్టీని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిన వ్యక్తి అని అన్నాడు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒకరు రక్తదానం చేసినట్లయితే నిండు ప్రాణాలను కాపాడిన వారమవుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపి సీనియర్ నాయకులు కసిరెడ్డి భాస్కర్రెడ్డి, చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి, రామస్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.