చిక్కడపల్లి : నగరంలో ప్రసిద్ధి గాంచిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్వామివారి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆదివారం స్వామి వారికి అత్యంత వైభవముగా మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము,ప్రత్యేక పూజలు, ఆవరణార్చన, గణపతి హవనము, శ్రీ గణపతి చతురావృతి తర్పమణము, విశేష అగ్ని ప్రతిష్ట, మహాన్యాస పూర్వక పంచామృత అభిషేకం,గణపతి హవనం, సర్వాభరణముంలతో అలంకరణ కార్యక్రమాలు జరిగాయి.
సాయంత్రం ఫల రసాలతో అభిషేకం జరిగింది.దేవాలయంలో కార్యనిర్వాహణాధికారి దీప్తి పర్యవేక్షణలో పూజ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.