శేరిలింగంపల్లి : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సోమవారం గచ్చిబౌలిలోని బ్రహ్మాకుమారీస్ శాంతిసరోవర్లో ఘనంగా నిర్వహించారు. పలువురు చిన్నారులు, బ్రహ్మాకుమారీలు ఈ వేడుకల్లో ఎంతో ఉత్సాహాంగా పాల్గొని కృష్ణుడు, గోపికల విన్యాసాలు అద్బుతంగా ప్రదర్శించి ఆందరినీ ఆకట్టుకున్నారు.
శాంతిసరోవర్ డైరక్టర్ కుల్దీప్ బెహన్ కృష్ణాష్టమి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక ఘట్టాలను వివరించారు. అంతకుముందు ఈ వేడుకలను జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ శంకరయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రహ్మాకుమారీలు పాల్గొన్నారు.