జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి
చౌటుప్పల్/ వలిగొండ, సెప్టెంబర్ 13 : వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిచేయడం అభినందనీయమని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని లింగోజిగూడెంలోని వ్యాక్సినేషన్ డ్రైవ్ను మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజుతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా నడుపుతున్న మండల వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్రెడ్డిని సన్మానించారు. అదేవిధంగా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయిన వలిగొండ మండలంలోని కేర్చిపల్లి, ఎం.తుర్కపల్లి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18ఏండ్లు నిండిన వారందరూ టీకా వేయించుకోవాలన్నారు. టీకా పూర్తి చేసుకున్న గ్రామాలను మిగతా గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం రెడ్లరేపాక ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి గ్రామంలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, కౌన్సిలర్ బండమీది మల్లేశం, సింగిల్విండో వైస్ చైర్మన్ చెనగోని అంజయ్యగౌడ్, ఎంపీపీ నూతి రమేశ్రాజ్, ఎంపీడీఓ గీతారెడ్డి, ఎంపీఓ కేదారీశ్వర్, సర్పంచులు తుమ్మల మంజుల, అరుంధతి, డాక్టర్ సుమన్కల్యాణ్ పాల్గొన్నారు.
సిబ్బందికి ప్రశంస
బీబీనగర్ : వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన మీదితండా, జమీలాపేట్ గ్రామాల్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పర్యటించారు. వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి గ్రామస్తులను అభినందించారు. ఇందుకు కృషి చేసిన ఆశ వర్కర్లు, సర్పంచులు, ఏఎన్ఎంలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్, ఎంపీడీఓ శ్రీవాణి, ఎంపీఓ స్వాతి, మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.