గిరిజన మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి : మంత్రి సత్యవతిరాథోడ్
భట్టుపల్లిలో ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభం
కరీమాబాద్, ఏప్రిల్ 9 : సీఎం కేసీఆర్తోనే గిరిజన సంక్షేమం ముందుకుసాగుతున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్ యోజనలో భాగంగా గిరిజన మహిళల కోసం భట్టుపల్లిలోని ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్ను శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వాలు గిరిజనులను పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గిరిజనుల అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. గిరిజన శాఖ ఇచ్చే శిక్షణతో మహిళలు ఎవరి కాళ్లపై వారు నిలబడి, మరో పదిమందికి ఉపాధి కల్పించాలని సూచించారు. గిరిజన మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకే వీహబ్ ద్వారా ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని గిరిజన శాఖకు, రాష్ర్టానికి మంచిపేరు తీసుకు రావాలన్నారు. కార్యక్రమంలో చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మె ల్యే అరూరి రమేశ్, జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టియానా, వీహబ్ సీఈవో దీప్తి రావుల, ఐటీడీఏ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కట్నం వేధింపులు : సీనియర్ అధికారి భార్య బలవన్మరణం
రాహుల్ ద్రవిడ్ను ఎప్పుడైనా ఇలా చూశారా.. కోహ్లి షేర్ చేసిన ఫన్నీ వీడియో