ఈ నెలాఖరు వరకు ఎర్లీ బర్డ్ పథకం
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 15: ముందస్తు పన్ను వసూళ్లపై బల్దియా దృష్టి పెట్టింది. ఈ మేరకు మున్సిపల్శాఖ ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఆర్థిక సంవత్సరం ఆరంభ మాసంలో నెలాఖరువరకు ఆస్తి పన్నులు చెల్లించిన వారికి 5 శాతం డిస్కౌంట్ వర్తింప జే స్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను వసూళ్లు మార్చి నెలతో ముగిశాయి. నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ముందస్తు పన్ను చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి సంవత్సరం లాగే ఈ సారి ఎర్లీ బర్డ్ పథకం అమలుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బకాయిలు పేరుపోకుండా ముందస్తు పన్ను చెల్లింపులను ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్యోద్దేశం. 2021-22సంవత్సరానికి సంబంధించి నివాస, నివాసేతర ఆస్తులపై ఎలాంటి బకాయిలు లేనివారు చెల్లించే మొత్తం పన్నులో 5శాతం రిబేటు ఉంటుందని ప్రకటించింది. ఈ నెల 30వరకే ఈ పథకం ప్రయోజనం వర్తిస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి మెదక్ మున్సిపాలిటీ 98 శాతం ఆస్తి పన్ను వసూళ్లు చేసింది.
ప్రచారం కల్పించాలి…
ఎర్లీ బర్డ్ పథకం గురించి ప్రచారం కల్పించాలని మున్సిపల్శాఖ మున్సిపాలిటీలకు సూచింది. సరైన ప్రచారం తెలియకపోవడంతో చాలామందికి 5శాతం రాయితీ విషయం తెలియడంలేదు. ఈ పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశాలిచ్చింది. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, కార్యాలయలంలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించింది. గతంలో బకాయిలు ఉన్నవారికి ఈ పథకం వర్తించదు. ఏటా క్రమం తప్పకుడా పన్నులు చెల్లించేవారు ఈ నెల 30లోగా చెల్లిస్తే 5శాతం రాయితీ పొందవచ్చు.
ఇవి కూడా చదవండి
ఇంత చేసినా ‘వకీల్ సాబ్’ సినిమాకు అక్కడ నిరాశే
ఫస్ట్ టైమ్ సక్సెస్..ఆనందంలో అల్లు