కమాన్చౌరస్తా, ఏప్రిల్ 25 : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ట్రినిటీ ఐఐటీ, నీట్ అకాడమీ విద్యార్థులు తమ సత్తా చాటారని విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ట్రినిటీ ప్రైమ్ క్యాంపస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ చూపారని, జాతీయ స్థాయిలో ఉత్తమమైన పర్సంటైల్తోపాటు ర్యాంకులు సాధించారని చెప్పారు.
జే హానికర్ అత్యుత్తమ ర్యాంకు 48, డీ గణేశ్ రావు 485, ఎం చిత్రాంజలి 532, ఏ రఘుపతి 789, ఎల్ జస్వంత్ 910, సీహెచ్ శివ 1397, ఎస్ సుమంత్ 1473, బి వర్ణిత రాణి 1626, ఆర్ నిఖిల్ 2279, ఎం ధనుంజయ్ 2464, సీచ్ ఆశిష్ నాయక్ 3113, ఏ గంగాధర్ 3280, పీ శ్రీజ 4663, జె కీర్తి 4633, డీ దేవేందర్ 4836, ఎల్ చంద్రపతి 4883, ఎం హిమబిందు 5210, బీ అష్రిత్ గౌడ్ 5310, బీ సందీప్ 5685, బీ వంశీ కృష్ణ నాయక్ 5964, శ్రీతేజ 6262 ర్యాంకులను సాధించారన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఆధ్యాపక బృందాన్ని అభినందించారు.