పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్సినిమాకు సంచలన వసూళ్లు వచ్చాయి. ఒకవైపు వైరస్ ఉన్నా కూడా ఈ సినిమా థియేటర్లలో దండయాత్ర చేసింది. ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తూ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. 2021లో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాగా వకీల్ సాబ్ చరిత్ర సృష్టించింది. ఇన్ని సంచలనాలు సృష్టించిన ఈ సినిమా ఒక చోట మాత్రం దారుణంగా నిరాశ పరిచింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయి డిస్ట్రిబ్యూటర్లను లాభాల్లోకి తీసుకొచ్చిన వకీల్ సాబ్.. ఓవర్సీస్ లో మాత్రం గట్టెక్కించలేకపోయాడు.
సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఓవర్సీస్ లో కలెక్షన్ల సునామీ కురుస్తోంది. కానీ వకీల్ సాబ్ విషయంలో మాత్రం అది జరగలేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. గతంలో పవన్ సినిమాలు అక్కడ 3 మిలియన్ మార్క్ కూడా క్రాస్ చేశాయి. అజ్ఞాతవాసి కేవలం ప్రీమియర్స్ తోనే 1.5 మిలియన్ మార్క్ అందుకుంది. అయితే పరిస్థితులు ఇప్పుడు బాగోలేవు. కరోనా ఈ కారణంగా ఈ సినిమాను చాలా తక్కువ ధరకు అమ్మారు. 1.3 మిలియన్ లక్ష్యంతో బరిలోకి దిగిన వకీల్ సాబ్ అది కూడా వసూలు చేయలేకపోయాడు.
ఈ ఏడాది ఓవర్సీస్ మార్కెట్లో 1 మిలియన్ దాటిన ఒకే ఒక సినిమాగా జాతి రత్నాలు చరిత్ర సృష్టించింది. పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఈ రికార్డు అనుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా వకీల్ సాబ్ ఓవర్సీస్ లో చతికిలపడింది. ప్రీమియర్ రూపంలో 3 లక్షల డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు మరో 4 లక్షలు డాలర్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా 7.3 లక్షల డాలర్లు మాత్రమే వసూలు చేసింది వకీల్ సాబ్. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 6 లక్షల డాలర్లు వసూలు చేయాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అది అసాధ్యం. దాంతో ఈ సినిమా బాగానే వసూలు చేసినా.. ఓవర్సీస్ లో మాత్రం ఫ్లాప్ అయింది.
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్లోకి వరుణ్తేజ్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్