మనోహరాబాద్, అక్టోబర్ 13 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. బుధవారం శివ్వంపేట మండలం శభాష్పల్లిలో బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అరవై ఏండ్ల ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ అణిచివేతకు గురైందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నేడు తెలంగాణ అన్నిరంగాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ యాస, భాషలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. బతుకమ్మ పండుగను విదేశాల్లో సైతం ఘనంగా జరుపుకొంటున్నారని చెప్పారు. అనంతరం మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజరమణగౌడ్, సర్పంచ్లు రంగపల్లి పార్వతిసత్యం ముదిరాజ్, మాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.