వరంగల్, ఏప్రిల్ 6 : గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో చేపట్టిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణనను పారదర్శకంగా చేపట్టాలని గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం ఆమె గ్రేటర్ పరిధిలోని ఎస్ఆర్ఆర్ తోట, కరీమాబాద్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు డివిజన్లలో సిబ్బంది చేపడుతున్న సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటర్ల సర్వే చేస్తున్న సిబ్బంది పక్కాగా వివరాలు నమోదు చేయాలన్నారు. బుధవారం నాటికి ఓటర్ల గణనను పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరం అయితే రాత్రి వరకూ సర్వే చేయాలన్నారు. సర్కిళ్ల వారీగా డిప్యూటీ కమిషనర్లు ఎప్పటికప్పుడు సర్వేను పర్యవేక్షించాలని సూచించారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ నాగేశ్వర్, ఏసీపీ గణపతి, డిప్యూటీ కమిషనర్ జోనా, సిబ్బంది ఉన్నారు. కాగా, సర్వేలో భాగంగా మంగళవారం హన్మకొండ బాలసముద్రంలోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ఓటర్ల వివరాలను ఆర్వో సుదర్శన్, ఆర్ఐ రబ్బాని సేకరించారు.
ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలి
నగరంలో కుడా, గ్రేటర్ ఆధ్వర్యం లో పూర్తయిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో కమిషనర్ సత్పతి పరిశీలించారు. అంబేద్కర్ జంక్షన్, కనకదుర్గా కాలనీలోని పార్కు సుందరీకరణ పనులు పూర్తయిన నేపథ్యంలో వాటిని ప్రారంభించేందుకు త్వరగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్లో కొనసాగుతున్న అభివవృద్ధి పనులను పరిశీలించారు. వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. కమిషనర్ వెంట కుడా ప్లానింగ్ అధికారి అజిత్రెడ్డి, ఈఈ భీమ్రావు, డీఈ సంతోష్బాబు, ఏఈలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
జైలుపై దాడి.. 1800 మంది ఖైదీలు పరారీ