ముంబయి : బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కరోనా బారిన పడింది. సోషల్ మీడియా ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. కొవిడ్-19 పాజిటివ్తో వెంటనే ఐసోలేట్ అయి హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపింది. తనతో సమీపంగా మెలిగినవారంతా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించింది. వైద్యుల సూచనల మేరకు అన్ని జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నట్లు వెల్లడించింది. తనపై చూపే ప్రేమకు, మద్దతుకు కృతజ్ఞతలంది. జాగ్రత్త చర్యలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాల్సిందిగా కత్రినా కోరారు.