మైనర్లతో సీఎం కేసీఆర్పై అసభ్యకర ప్రచారం
తీవ్రంగా ఖండిస్తున్న విద్యావేత్తలు
మహబూబ్నగర్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అభం శుభం తెలియని చిన్నారులను ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాడేందుకు సైతం ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా చేస్తున్న ప్రయత్నాలను విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. ఆన్లైన్ క్లాసుల పేరిట చిన్నారుల చేతిలో సెల్ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లు ఇస్తున్న తల్లిదండ్రులు వాటిని ఎలా వినియోగించుకుంటున్నారో కూడా గమనించాలని విద్యావేత్తలు చెబుతున్నారు. కరీంనగర్లో ఏడో తరగతి చదివే బాలుడితో సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టేలా ప్రోత్సహించిన ప్రతిపక్షాలకు చెందిన నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పసి మనసులపై విష ప్రభావం అస్సలు మంచిది కాదని మేధావులంటున్నారు. ఇలాంటి వ్యవహారాలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఆన్లైన్ తరగతుల పేరిట నిత్యం విద్యార్థులు ఏం చేస్తున్నారనే అంశాన్ని తల్లిదండ్రులు పక్కాగా గమనించాల్సిన అవసరం ఉందని మానసిక వైద్యనిఫుణులు అభిప్రాయపడుతున్నారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే..
బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చిన్నారులతో అసభ్యకరంగా పోస్టింగ్ పెట్టించడం సరైనది కాదు. వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం చిన్నారులను బలిపశువులను చేయడం వారి దివాలు కోరు రాజకీయతనానికి నిదర్శనం. నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక, నీతిమాలిన పనులు మానుకోవాలి.
అప్రమత్తంగా ఉండాలి
స్మార్ట్ ఫోన్ వల్ల చిన్నపిల్లలు ఇతరుల గౌరవం భంగపరిచే విధంగా గానీ, ఏ ఇతర ప్రకటనలు షేర్ చేసినా నేరమే. వారిపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. చిన్నారులు ఎలాంటి పోస్టింగ్లు పెట్టకుండా చూసుకోవాలి. పోస్టింగ్లు పెడితే కఠిన శిక్షలుంటాయి. తల్లిదండ్రులు గమనించాలి.
ఇవి కూడా చదవండి
ఉగాది పచ్చడి తింటే లాభమేంటి?
రోజూ తినే ఆహారంలో ఇవి ఉంటే ఆరోగ్యం మీ వెంటే
IPL 2021: ఉత్కంఠపోరులో పంజాబ్ గెలుపు
IPL 2021: బట్లర్ వరుసగా 4, 4, 4, 4