ముంబై: పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 222 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కనీసం పరుగుల ఖాతా తెరవకుండానే తొలి ఓవర్లోనే
బెన్ స్టోక్స్ ఔటయ్యాడు. షమీ వేసిన మూడో బంతికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నాలుగో ఓవర్లో మరో ఓపెనర్ మనన్ వోహ్రా కూడా అర్షదీప్ బౌలింగ్లో ఔటవడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది.
ఈ దశలో క్రీజులో ఉన్న సంజూ శాంసన్, జోస్ బట్లర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రిలే మెరిడిత్ వేసిన ఐదో ఓవర్లో బట్లర్ వరుసగా 4 ఫోర్లు బాది ఇన్నింగ్స్లో ఊపు తీసుకొచ్చాడు. ఇంగ్లాండ్ సూపర్స్టార్ బట్లర్ పంజాబ్ బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చాడు. జే రిచర్డ్సన్ వేసిన 8వ ఓవర్లో అనూహ్యంగా బట్లర్ బౌల్డ్ అయ్యాడు. 8 ఓవర్లకు రాజస్థాన్ 3 వికెట్లకు 78 పరుగులు చేసింది. ప్రస్తుతం శివమ్ దూబే(8), శాంసన్(29) క్రీజులో ఉన్నారు.