వైభవంగా నీలకంఠుడి ప్రభోత్సవం
మహాసరస్వతిగా ్రభ్రామరి
శ్రీగిరికి పోటెత్తిన కన్నడిగులు
ఆకట్టుకున్న వీరాచార్యుల విన్యాసాలు
నేడు పంచాంగ పఠనం, రథోత్సవం
శ్రీశైలం, ఏప్రిల్ 12: శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాలు అంబరానంటుతున్నాయి. సోమవారం ఉదయం స్వామి, అమ్మవార్లు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధన, జపానుష్ఠానాలు, రుద్రహోమం, పారాయణాలు నిర్వహించారు. అనంతరం భ్రమరాంబ అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చన, చండీహోమాలను నిర్వహించారు. సాయంత్రం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అత్యంత వైభవంగా ప్రభోత్సవం నిర్వహించారు. ప్రభను వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ బయటకు తీసుకొని వచ్చి ప్రభపై అధిష్టింపజేసి అర్చకులచే శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించారు. లక్షలాది కన్నడ భక్తుల ప్రభను తిలకించేందుకు పురువీధుల్లోకి తరలివచ్చారు. కన్నడ భక్తజనం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవార్లను కీర్తిస్తూ ప్రభోత్సవంలో పాల్గొన్నారు. చైత్రశుద్ధ పాడ్యమినాడు స్వామి, అమ్మవార్లు రథోత్సవంలో క్షేత్ర పురువీధుల్లో విహరించేందుకు ముందుగా చండీశ్వరుడు ముందుగా వచ్చి క్షేత్రపర్యటన చేసిరావడానికి ప్రభోత్సవం నిర్వహిస్తారని పురాణాల్లో చెప్పబడింది.
నందివాహనంపై విహరించిన నీలకంఠుడు
ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సమూర్తులను నందివాహనంపై ఆసీనులగావించి షోడశోపచార ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందివాహనంపై అధిరోహించిన స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడంతో చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుందని, భోగభాగ్యాలు కలుగుతాయని ఇతిహసాల్లో చెప్పబడుతోంది.
మహాసరస్వతిగా శ్రీశైల భ్రామరి
అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరోదైన శ్రీశైల భ్రమరాంబ అమ్మవారు మహాసరస్వతి అలంకరణలో భక్తులను కటాక్షించింది. చతుర్భుజాలు కలిగిన ఈదేవి వీణ, అక్షరమాల, పుస్తకాన్ని ధరించి భక్తాదులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు, నందిమండపం నుంచి బయలు వీరభధ్రస్వామి వరకు గ్రామోత్సవం కనుల పండవగా సాగింది. గ్రామోత్సవంలో వీరాచారుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఈవో కేఎస్ రామారావుతోపాటు ఈఈ మురళీబాలకృష్ణ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకుడు అనిల్కుమార్, ఏఈవోలు మల్లయ్య, హరిదాస్, కృష్ణారెడ్డి, డీఈలు శ్రీనివాస్రెడ్డి, నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న, రెవెన్యూ అధికారి శ్రీహరి, పర్యవేక్షకుడు ఉమేశ్ పట్వారి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఎన్ఆర్సీ తెచ్చినా.. గోర్ఖాలను వెళ్లగొట్టం