ఎన్నో అజరామరమైన సినిమాల్ని నిర్మించడమే కాకుండా గొప్ప నటుల్ని పరిచయం చేసిన జెమిని సంస్థ ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకలో జెమిని రికార్డ్స్ ఆడియో సంస్థను ప్రారంభించారు. జెమిని సంస్థల సీఈవో పీవీఆర్ మూర్తి మాట్లాడుతూ ‘చిన్న నిర్మాతలతో పాటు సంగీత దర్శకులు, గేయరచయితల శ్రేయస్సును కాంక్షిస్తూ ఆర్థికంగా వారికి తోడ్పాటును అందించాలనే ఆడియోరంగంలోకి అడుగుపెడుతున్నాం’ అని తెలిపారు. దక్షిణాది చిత్రసీమఅభివృద్ధిలో కీలకభూమిక పోషించిన జెమిని సంస్థ ఆడియో రంగంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని నిర్మాత రామ్మోహన్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్రాజ్, రాంబాబు గోసాల తదితరులు పాల్గొన్నారు.