ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నిధులు
ఇక నియోజకవర్గాల్లో అభివృద్ధి పరుగులే..
ఏడాదికి రూ.5 కోట్లు..
బడ్జెట్లో కేటాయించిన ప్రభుత్వం
స్థానిక సంస్థలకూ నిధులు, అధికారాలు
ప్రజాప్రతినిధుల హర్షం
నాగర్కర్నూల్, ఏప్రి ల్ 2 (నమస్తే తెలంగాణ) : ప్రజాప్రతినిధులు.. తమ పేరులో ఉన్నట్లుగానే ఇక నిధులతో కళకళలాడనున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో నియోజకవర్గ ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్సీలకూ ప్రత్యేకంగా నిధులను కేటాయించారు. దీని ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి ఏడాది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంవత్సరానికి రూ.5 కోట్లు కేటాయించనుండడం విశేషం. అలాగే జిల్లా, మండల పరిషత్లు, పంచాయతీలకూ నిధులతోపాటు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి మరింత పరుగులు పెట్టనున్నది.
ప్రజాప్రతినిధులు.. తమ పేరుకు తగ్గట్టుగానే ఇక నిధులతో కళకళలాడనున్నారు. సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులను మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అసెంబ్లీలో ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీని ప్రకారం ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంవత్సరానికి రూ.5 కోట్ల చొప్పున నిధులు మంజూరు కానున్నాయి. రెండేండ్లుగా నిధులు లేక ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పడిన ఇక్కట్లు తొలగిపోనున్నాయి. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ లు, పాఠశాలలు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలు వంటి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయనున్నారు. ప్రస్తు తం సీఎం, ప్రభుత్వం నుంచి, ఆయా శాఖల మంత్రుల నుంచి మాత్రమే ఎమ్మెల్యేలు నిధులను తీసుకొస్తున్నారు. దీంతో అభివృద్ధి పనుల విషయంలో జాప్యం జరుగుతున్న ది. ఇప్పుడు ప్రభుత్వమే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నేరుగా నిధులు కేటాయిస్తుండటంతో గ్రామాల్లోని సమస్యలు, అభివృద్ధి పనుల హమీలను నెరవేర్చేందుకు మార్గం సుగమం కానున్నది. ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా 130 వరకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
ఏడాదికి వ చ్చే రూ.5 కోట్ల నిధులతో రానున్న మూడేండ్లలో ఒ క్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రూ.15 కోట్ల చొప్పున అభివృద్ధి ప నులకు వెచ్చించే అవకాశం ఉన్నది. దీంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ దాదాపుగా పరిష్కారం కానున్నా యి. నిధుల కేటాయింపుతో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. అదేవిధంగా జిల్లా, మండల పరిషత్లకు సైతం నేరుగా నిధులు మంజూరు కానున్నాయి. ఇటీవలే ప్రభుత్వం దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గ్రామాల్లో సర్పంచులకు నేరుగా అధికారులతో సంబంధం లేకుండా గ్రామసభ తీర్మానం ద్వారానే నిధులు ఖర్చు పెట్టుకునేలా జీవో విడుదల చేసింది. దీంతో ప్రజాప్రతినిధులకు ఈ ఏడాది ఆర్థికంగా కలిసి రానున్నది. దీంతో ఇటు ప్రజాప్రతినిధుల్లో.. అటు ప్రజల్లోనూ సంతోషం వ్యక్తమవుతున్నది.
చాలా సంతోషకరం..
నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం రూ.5 కోట్లు కేటాయించడం చాలా సంతోషకరంగా ఉన్నది. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలను ఈ నిధులతో పరిష్కరించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్నది. ప్రాజెక్టులు, రోడ్ల కోసం రూ.కోట్లల్లో నిధులు మంజూరు చేస్తున్నది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో గ్రామ స్థాయిలోని సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలవుతుంది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
ఇవి కూడా చుడండి
ధోనీ 2005 vs ధోనీ 2021 ఇంటర్వ్యూ.. వీడియో చూశారా?
గిఫ్ట్గా వచ్చిన మహీంద్రా థార్ కార్లతో నటరాజన్, శార్దూల్ పోజులు
కరోనాతో హాస్పిటల్లో చేరిన సచిన్ టెండూల్కర్
ఊర్వశి వాట్సాప్ బ్లాక్.. ఇశా నేగితో రిషబ్ డేటింగ్
జోరుమీద ఆటోమొబైల్స్: కార్లు మొదలు బైక్స్ సేల్స్ పైపైకి!